Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులు, రైతుల మధ్య తోపులాట
- స్పృహ కోల్పోయిన రైతు
నవతెలంగాణ- కొణిజర్ల
సాగునీరు లేక నిలువునా ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరుతూ చింతకాని, కొణిజర్ల మండలానికి చెందిన రైతులు మండల పరిధిలోని బోనకల్ బ్రాంచ్కెనాల్ వద్ద గల రాష్ట్రీయ రహదారిపై ఆదివారం రాస్తారోకో చేశారు. సాగర్ నీరు వస్తాయనే ఉద్దేశంతో మండలంలో సాగర్ ఆయకట్టు పరిధిలో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలు సాగు చేశామని, సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటిస్తే మత పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేసిన మొక్కజొన్న పంట కండ్లముందే ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లే దేని ఆగ్రహాం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్) ఎన్డీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదరుప్రతాప్ రైతులకు మద్దతు తెలిపారు.
గంటకు పైగా ఆందోళన కొనసాగడంతో వాహనల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఎల్లయ్య తన సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. రాస్తారో కోను విరమింపజ ేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆందోళనకా రులను బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. పెద్దగో పతి గ్రామానికి చెందిన వడ్డాణపు దర్గయ్య స్పృహ కోల్పోయాడు. జీజేపీ నాయకుడు ఉదరు ప్రతాప్ చేతికి స్వల్ప గాయమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడి తగుచర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఫోన్లో హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ రాస్తారోకోలో ఎన్డీ డివిజన్ కార్యదర్శి ఆవుల అశోక్, ఝాన్సీ, బీజేపీ వైరా అసెంబ్లీ నియోజ కవర్గ కన్వీనర్ బండారు నరేశ్, కొల్లి సుధాకర్ , రైతులు పాల్గొన్నారు.
సాగర్ నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
సాగునీరు విడుదల చేసి రబీ పంటలను కాపాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, మండల కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీళ్ల కోసం రైతులు రాస్తారోకో చేస్తుంటే ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరించడం సరైంది కాదన్నారు. రైతులు ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నారనీ, నీరు రాకపోతే తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. నీరు విడుదల చేసేవరకు రైతులతో కలిసి పోరాడతామని పేర్కొన్నారు.