Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
నాదెండ్ల అరుణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోనకల్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ప్రతి నెలా 20 వ తేదీన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వాహకులు నాదెండ్ల కిశోర్కుమార్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో మందులను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నా మన్నారు. బోనకల్ మండలంలో ఎక్కువ మంది బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారనీ, వారికి నెలకు సరిపడా మందులు పంపిణీ చేయడం ద్వారా చాలావరకు ఉపయోగకరంగా ఉందన్నారు. ఆదివారం వైద్యశిబిరంలో 600మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు రాజశేఖర్, కే.వెంకటేశ్వరరావు, సుబ్బారావు, జెడ్పీటీసీ బానోతు కొండా, నిర్వాహకులు తెల్లాకుల శ్రీనివాసరావు, బానోతు శ్రీనివాసరావు, చెన్నా లక్షాద్రి, సిబ్బంది పుల్లయ్య పాల్గొన్నారు.