Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మధిర
హన్మకొండకు చెందిన ప్రముఖ సేవా సంస్థ మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి ఇచ్చే అవార్డులను మధిరకు చెందిన సామాజిక సేవా కార్యకర్త లంకా కొండయ్య, డ్యాన్స్మాస్టర్ ఉమకు అందచేశారు. ఆదివారం హన్మకొండలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరికి సేవాసంస్థ నిర్వాహకులు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా లంకా కొండయ్య మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో రుగ్మతలను రూపుమాపేందుకు సామాజిక సేవ చేస్తూ అందరి మన్ననలు పొందటం ద్వారా ఈ అవార్డు తనకు లభించిందని, ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని, మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహి ంచనున్నట్టు ఆయన తెలిపారు. డ్యాన్స్మాస్టర్ ఉమ మాట్లాడుతూ డ్యాన్స్మాస్టర్గా పేరు తెచ్చుకుంటూ విద్యార్థులు, యువతకు డ్యాన్స్ను నేర్పుతూ జానపద నృత్యాలను కూడా నేర్పటం జరుగుతుందని, తనకు గతంలో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవటం జరిగిందని, సేవా సంస్థ ద్వారా ఉత్తమ డ్యాన్స్మాస్టర్గా తనకు ఈ అవార్డు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.