Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్లూరు
ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మండలంలోని 22 గ్రామాల్లో నిర్వహించారు. ఓటర్ల జాబితాను పోలింగ్ బూత్ల వద్ద అధికారులు ఆదివారం ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు ఉందో లేదో చూసుకునేందుకు వీలుందని తహసీల్దార్ కే. యోగేశ్వరరావు తెలిపారు. కల్లూరులో స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల చివరి ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ఓటుహక్కు కల్పిస్తామన్నారు,. ఆన్లైరన్లో దరఖాస్తు చేసుకున్నాక ఆ ప్రతిని తహసీల్దార్ కార్యాలయంలో గానీ, స్థానిక బీఎల్వోలకు అందించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు చిరంజీవి, ఉమామహేశ్వరరావు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.