Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లిటౌన్
ఎల్ఐసీని ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి శ్రీరాముల సారంగపాణి అన్నారు. ఎన్ఎఫ్ఐఎఫ్డబ్ల్యూఐ సంఘం ఆవిర్భవించి 63ఏండ్లు అవుతున్న సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలను సత్తుపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు ఎస్డబ్ల్యూ.కల్విట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ ఆధ్వర్యంలో పాలసీదారులకు, ఏజంట్లకు విశేషమైన సేవలందిస్తూ ఎల్ఐసీని విజయపథంలో నడిపిస్తున్నామన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు జీవితబీమా ఏజన్సీని ఇప్పించి వెన్నెముక్కగా నిలవడంలో డెవలప్మెంట్ అధికారుల పాత్ర ఎల్ఐసీలో కీలకమైందన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు జీ.నాగభూషణం, బ్రాంచ్ కామ్రెడ్ యు.రాజారెడ్డి, ఆఫీస్ సిబ్బంది, ఏజంట్లు, పాలసీదారులు తదితరులు పాల్గొన్నారు.