Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మధిర
మిషన్ భగీరథ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు జీతాలను వెంటనే చెల్లించాలని యూనియన్ నాయకులు జెల్లెపల్లి బాబూరావు డిమాండ్ చేశారు. ఆదివారం మాటూరు డీహెచ్ఓ వద్ద జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 8నెలల నుంచి కార్మికులకు జీతాలు చెల్లించటంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో 360మంది కుటుంబాలు ఇల్లు గడవటమే కష్టంగా ఉందన్నారు. పండుగల సందర్భంగా కూడా జీతాలు విడుదల చేయకపోవటంతో పండుగ జరుపుకోలేని పరిస్థితుల్లో తాము ఉన్నామని, గతంలో జిల్లా అధికారులకు విన్నవించుకోగా రెండు నెలలు జీతాలను విడుదల చేశారని, మిగితా సొమ్మును విడుదల చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా ఇంతవరకు అందించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించకపోతే మంగళవారం నుంచి సమ్మెబాట పట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజరుకుమార్, కొంగర రవి, సత్యనారా యణ, రవి, సురేష్, రమేష్, మోషే పాల్గొన్నారు.