Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
కల్లుగీత కార్మిక సంఘం తెల్దారుపల్లి గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. అధ్యక్షునిగా మడిపల్లి వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. ఆ సంఘం మహాసభను మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గ్రామ అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ మడిపల్లి వెంకన్న మాట్లాడుతూ గ్రామంలో గీత కార్మికుల సంక్షేమానికి, గౌడ సంఘం అభివృద్ధికీ ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఉపాధ్యక్షునిగా యరకల కృష్ణయ్య, కోశాధికారిగా ఆలూరి కోటయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేజీకేఎస్ గ్రామ అధ్యక్షునిగా ఎన్నికైన పెద్ద గౌడ మడిపల్లి వెంకన్నను సర్పంచ్ సిద్ధినేని కోటయ్య, గ్రామ నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు, తమ్మినేని వెంకట్రావ్, యల్లంపల్లి నాగయ్య, యర్రా నరసింహారావు, జక్కంపూడి కృష్ణ, జాలారు సంగయ్య, దరిపల్లి కోటయ్య, పాము వెంకన్న, గ్రామపెద్దలు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలగం వెంకట్రావ్, మండవ సైదులు, జలగం సైదులు, బోడపట్ల వెంకన్న, ఉపేందర్, శ్రీను, ఉమామహేశ్వరరావు, వీరబాబు, కార్తిక్, రామనాధం, శ్రీను, లక్ష్మణ్రావు, సత్యం, సుబ్బయ్య, రాజేందర్, సుదర్శన్ పాల్గొన్నారు.