Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కారేపల్లి
సీపీఐ(ఎం)కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన ఇద్దరిని పార్టీని నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మూడ్ శోభన్, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఉసిరికాయపల్లిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మండల కమిటీ సభ్యుడైన భూక్యా మాన్సింగ్, గ్రామశాఖ సభ్యుడు లాకావత్ రాందాస్లు గ్రామ శాఖ మెజార్టీ తీర్మానం ప్రకారం నిర్ణయించిన సర్పంచ్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తుండటాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న ఇద్దరిపై చర్యలు తీసుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర, మండల నాయకులు దాసరి మల్లయ్య, బానోత్ బన్సీలాల్, తేజావత్ చందర్, మండల వెంకన్న, పచ్చిపాల సోమయ్య, భూక్యా రమేష్, పచ్చిపాల రమేష్, మూడ్ అంక, పోతురాజు, పుల్లయ్య, భూక్యా బాలు పాల్గొన్నారు.