Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొణిజర్ల
గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ నాయకులు, ప్రజలు సహకరించాలని ఎస్సై సీహెచ్. ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు. వివిధ రాజకీయ నాయకులు, పంచాయతీలకు పోటీల్లో ఉన్న అభ్యర్థులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 30న మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న మండలంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా చూడాలని కోరారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలన్నారు. ఎవరైనా ఘర్షణ లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.