Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
మలేరియా గుర్తించిన వైద్యసిబ్బంది కారేపల్లి మండలం, దుబ్బతండాలో నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలో ఒక వ్యక్తికి మలేరియా కేసు నమోదైంది. దీంతో నివారణ చర్యల్లో భాగంగా ఆదివారం దుబ్బతండాలో ప్రతీ ఇంటికి ఏసీఎం మందును పిచికారి చేశారు. వీధుల్లో నిల్వ ఉన్న మురికి గుంటల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ సందర్బంగా మండల వైద్యాధికారి డాక్టర్ వై.హన్మంతరావు మాట్లాడుతూ ఇంటి ఆవరణంలో మురికి గుంటలు లేకుండా చూచుకోవాలని, వారంలో ఒక రోజు నీటిని నిల్వ చేసే తొట్లను శుభ్రం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. దోమలు వ్యాప్తి లేకుండా చూచుకోవటం ద్వారా వ్యాధులు దరి చేరకుండా చూచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు కళావతి, విజయకుమారి ఆశ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.