Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వైరా
ఆలిండియా గ్రామీణ ఢాక్ సేవక్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా బండి జయరాజు మరోసారి ఎన్నికయ్యారు. ఆ సంఘం మహాసభలు భద్రాచలం లోని వాసవి కన్యకాపరమేశ్వరి కళ్యాణమండపంలో శనివారం నిర్వహించారు. వైరా మండలం లోని గన్నవరం బ్రాంచి పోస్ట్మాస్టర్గా, ఖమ్మం డివిజన్ గ్రామీణ ఢాక్ సేవక్స్ యూనియన్ నాయకులుగా పనిచేస్తున్న బండి జయరాజును మరోసారి రాష్ట్ర కార్యదర్శిగా మహాసభల్లో ఎన్నుకున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్గా ఈ సంఘానికి జయరాజు రెండవసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై గతంలో వలె పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులకు అందుబాటు లో ఉండి రాష్ట్ర స్థాయి అధికారులతో సంప్రదించి అన్ని సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల అండదండలతో పనిచేస్తానని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అలాంటి సందర్భంలో సంఘటిత ఆందోళనలు ,ఉద్యమాలతో సమస్యలను సాధించుకోవలసి ఉంటుందని కూడా పేర్కొన్నారు. మహాసభలో ఆలిండియా అధ్యక్షులు బీవీ.రావు, జనరల్సెక్రటరీ ఎస్ఎస్.మహదేవయ్య పాల్గొన్నారని పేర్కొన్నారు.