Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
భారత్ యువశక్తి ఆధ్వర్యంలో సత్తుపల్లిలో ముగింపు రోజు ఆదివారం నిర్వహించిన యూత్ ఫెస్టివల్లో స్థానిక టాలెంట్ స్కూలు విద్యార్థులు ప్రతిభ చాటారు. వ్యాసరచన సీనియర్స్ విభాగంలో విద్యార్థి బి.దినేశ్ ప్రథమ బహుమతిని సాధించగా జూనియర్స్ విభాగంలో ద్వితీయ బహుమతిని ఎన్.వర్దిని కైవశం చేసుకొంది. వీటితో పాటు సైన్స్ఫేర్లో ప్రథమ బహుమతిని రవితేజ, తోట దీపికలు సాధించి రూ.5వేల నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. చిత్రలేఖన పోటీల్లో జూనియర్స్ విభాగంలో చందన ద్వితీయ బహుమతి పొందగా తృతీయ బహుమతిని ధనుష సాధించింది. బహుమతులు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ అరుణ, ఉపాధ్యాయులు అభినందించారు.