Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోనకల్ మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లోనూ ఒక్కోరకమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. 2013 పంచాయతీ ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లోనూ ద్విముఖ పోటీనే ఉన్నది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ద్విముఖ, మరికొన్ని గ్రామాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీలు నెలకొన్నాయి. తూటికుంట పంచాయతీలో సీపీఐ(ఎం), టీడీపీ పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్, కాంగ్రెస్లు విడివిడిగా పోటీ చేస్తున్నాయి, లక్ష్మీపురం పంచాయతీలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ విడిగా పోటీ చేస్తోంది. గోవిందాపురం(ఎల్) పంచాయతీకి సీపీఐ(ఎం) ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. గార్లపాడు పంచాయతీలో సీపీఐ(ఎం), కాంగ్రె స్లు కలిసి పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ ఒంట రిగా పోటీ చేస్తోంది. రామాపురం పంచాయతీలో టీఆర్ఎస్, సీపీఐ ఉమ్మడిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. రావినూతల పంచాయతీలో సీపీఐ(ఎం), కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ ఒంటరిగా పోటీలో ఉంది. బోనకల్ పంచాయతీ లో సీపీఐ(ఎం), కాంగ్రెస్లు ఉమ్మడిగా పోటీలో ఉంటే టీఆర్ఎస్ ఒంటరిగా పోటీలో ఉంది. చిరునోముల పంచాయతీలో సీపీఐ(ఎం), కాంగ్రెస్, టీఆర్ ఎస్లు విడివిడిగా పోటీలో ఉన్నాయి. చొప్పకట్ల పాలెం పంచాయతీ లో సీపీఐ(ఎం), టీఆర్ఎస్లు ఉమ్మడిగా పోటీలో ఉండగా, కాంగ్రెస్ ఒంటరిగా పోరులో ఉంది. ముష్టి కుం టలో సీపీఐ(ఎం), కాంగ్రెస్లు విడివిడిగా పోటీ చేస్తుంటే, టీఆర్ఎస్, సీపీఐలు ఉమ్మడిగా పోటీ చేస్తు న్నాయి. నారాయణపురంలో కాంగ్రెస్, సీపీఐ(ఎం), టీఆర్ఎస్లు విడివిడిగా పోటీలో ఉన్నాయి. పెద్ద బీరువల్లి పంచాయతీలో సీపీఐ (ఎం), టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్లోని ఒక వర్గం సీపీఐ(ఎం)కు మద్దతిస్తోంది. మరో వర్గం టీఆర్ఎస్కు మద్ద తుగా ఉన్నాయి. ఆళ్లపాడులో సీపీఐ(ఎం), కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు విడివిడిగా పోటీలో ఉన్నాయి.
ఇంకా సా..గుతున్న చర్చలు
చిన్నబీరువల్లిలో కాంగ్రెస్, సీపీఐ విడివిడిగా పోటీలో ఉన్నాయి. టీఆర్ఎస్తో రెండు పార్టీల నాయకులు చర్చలు సాగిస్తున్నారు. ఈ పంచాయతీలో పొత్తులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జానకీపురంలో పొత్తుల చర్చలు సాగుతూనే ఉన్నాయి. రాయన్నపేటలో సీపీఐతో టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పొత్తుల చర్చలు సాగుతున్నాయి. మోటమర్రిలో సీపీఐ(ఎం), కాంగ్రెస్లు పోటీ పడుతున్నాయి. మిగిలిన సీపీఐ, టీడీపీలతో పొత్తుల కోసం చర్చలు సాగుతున్నాయి. కలకోటలో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐల మధ్య పోటీ నెలకొంది. మూడు పార్టీల మధ్య ఇంకా పొత్తుల చర్చలు సాగుతున్నాయి. బ్రాహ్మణపల్లి, రాపల్లి, జానకీపురం, గోవిందాపురం(ఏ) గ్రామాల్లో సీపీఐ(ఎం), టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐల మధ్య ఇంకా పొత్తుల చర్చలు కొలిక్కిరాలేదు. సీతానగరంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ(ఎం) ల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఇలా చిత్ర విచిత్రంగా ఎన్నికల పోరు సాగుతోంది.