Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - ఖమ్మం టౌన్
ఖమ్మం నగరంలో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఐ 44వ జిల్లా మహా సభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తాళ్ల నాగరాజు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చింతల రమేష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్ పోరాటాల రూపకల్పన కోసం ఈ మహా సభలు జరుగుతు న్నాయన్నారు. ఈ మహా సభల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సెమినార్లు, సదస్సులు, వినూత్న కార్యక్ర మాలు చేపడు తున్నామని తెలిపారు. మహా సభలకు విద్యావేత్తలు, ప్రముఖులు, హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థి లోకం యావత్తు ఈ మహా సభల్లో పాల్గొని విజయ వంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్య క్షుడు జె.అశోక్,బి.హేమలత, గర్ల్స్ కో కన్వీనర్ గాయత్రి, నాయకులు మధు, ప్రవీణ్, మహేష్, ప్రేమ్ గాంధీ పాల్గొన్నారు.