Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -ఖమ్మం టౌన్
ప్రభుత్వ పథకాలు, ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులపై సంపూర్ణ అధ్యయనం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ పేర్కొన్నారు. వింటర్ స్టడీ టూర్ కమ్ భారత్ దర్శన్లో భాగంగా 2018 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు 18 మంది ఆదివారం ఖమ్మం నగరానికి చేరుకున్నారు. నగరంలోని ఎన్ఎస్పీ అతిధి గహంలో వారు జిల్లా కలెక్టర్ను, నగర పోలీస్ కమిషనర్ను కలుసుకున్నారు. ఆ సంధర్భంగా ట్రైనీ ఐఏఎస్ అధికారులకు జిల్లా విస్తీర్ణం, భౌగోళిక సమాచారం, జన సాంద్రత, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై కలెక్టర్ వారికి వివరించారు. అలాగే జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గిరిజనుల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా చేపడుతున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు అటవీ హక్కుల చట్టం అమలు, గిరిజన సంక్షేమ వసతి గహాల నిర్వహణ వంటి విషయాలపై శిక్షణా అధికారులకు కలెక్టర్ వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణ అధికారి సునీల్ హిరామత్, అసిస్టెంట్ కలెక్టర్ హనుమంతు కోడింబా, సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.