Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖానాపురంహవేలీ
జనవరి 2019 నాటికి 18 ఏండ్లు నిండినవారు ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్ కర్ణన్ అన్నారు. ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు చేపట్టిన కేంద్రాలను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. నగరంలోని నిర్మల్ హృదరు, ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ నూతనంగా పేరు నమోదు చేసుకునేందుకు సరైన ఆధారాలతో బూత్ లెవల్ అధికారుల వద్ద దరఖాస్తులు అందజేయవచ్చాన్నారు. ఆయన వెంట నగరపా లక సంస్థ కమిషనర్ జే. శ్రీనివా సరావు, అర్బన్ తహసీల్దార్ రామ్మూర్తి పాల్గొన్నారు.