Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 42 నెలలుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహణ
- బోడేపుడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ- వైరాటౌన్
సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో వైరా పట్టణంలో స్థానిక బోడేపూడి భవన్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైందని బోడేపూడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు, పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ అన్నారు. ఆదివారం వైద్య శిబిరంలో వారు మాట్లాడుతూ బోడెపూడి కళానిలయం అధ్వర్యంలో స్థానిక బోడేపూడి భవన్లో గత 42 నెలలుగా ప్రతి నెలా 3వ ఆదివారం వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరంలో షుగర్, బీపీ, కొలస్ట్రాల్్, అల్సర్ వ్యాధులకు పరీక్ష చేసి నెలకు సరిపడా మందులను ఇస్తున్నామని తెలిపారు. బయటి మార్కెట్లో రూ.1000లకు పైగా ఖర్చు అయ్యే మందులను కేవలం రూ.100కే అందిస్తున్నట్టు వివరించారు. వివిధ జిల్లాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా షుగర్, బీపీ, అల్సర్ వ్యాధిగ్రస్తులు వైద్య సేవలను పొందుతున్నారన్నారు. గత 42 నెలలుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ చీకటి భారవి, డాక్టర్ జట్ల రంగారావు, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు ఈ వైద్య శిబిరం ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారన్నారు. ఉదయం 5 గంటల నుంచి ముగ్గురు డాక్టర్లు, 21 మంది వాలంటీర్లు వైద్య శిబిరంలో సేవలు అందిస్తున్నారు. వైరా పట్టణంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించడంలో సీపీఐ(ఎం) ముందంజలో ఉందన్నారు. మెరుగైన వైద్యాన్ని ఉచితంగా సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులను పలువురు అభినందించారు.
వైద్య శిబిరాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం సందర్శించి, నిర్విరామంగా సేవలందిస్తున్న వాలంటీర్లను అభినందించారు. ఈ వైద్య శిబిరంలో ఎంపీపీ బొంతు సమత, గుడిమెట్ల రజిత, నర్వనేని ఆదిలక్ష్మి, ఉప్పేర్ల రాణి, మోదుగు నాగరాణి, శీలం వెంకట నారాయణరెడ్డి, వనమా చిన్న సత్యనారాయణ, నర్వనేని సత్యనారాయణ, గుడిమెట్ల మోహన్రావు, అమరనేని వెంకటేశ్వరరావు, నారికొండ అమరేందర్, బోరే కిషోర్, తోట నాగేశ్వరరావు, బందెల పౌలు, రాయల స్రవంతి, ఉప్పెర్ల అనంతకృష్ణ, బొంతు భగత్, మాదినేని ఉదరు తదితరులు వాలంటీర్లుగా సేవలను అందించారు.