Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరాలోని బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం ఆదివారం పరిశీలించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కేంద్రంలో స్టేషన్ నెంబరు 180లో మొత్తం 829 ఓట్లు ఉండగా కేవలం 396 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలింగ్ బూత్ను సందర్శించినట్టు జేసీ తెలిపారు. పోలింగ్ స్టేషన్లో ప్రత్యేక పర్యవేక్షణ (స్పెషల్ సమ్మరి రిజిస్ట్రేషన్) లో భాగంగా స్పెషల్ క్యాంపెయినింగ్డే గా ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు నిర్వహించినట్టు ఆమె తెలిపారు. పోలింగ్ స్టేషన్ బీఎల్వోతో, అందుబాటులో ఉన్న ఓటర్లతో ఆమె చర్చించారు. ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు.