Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ మారడం కాదు ప్రజల్లో ఉండటం ముఖ్యం
- దొంగచాటు రాజకీయాలు నాకు చేతకావు
- చిట్చాట్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఎట్టకేలకూ ఆదివారం అసెంబ్లీలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో వెంకటవీరయ్య ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ప్రమాణ స్వీకారం చేసిన సండ్ర ఎంతో సాదాసీదాగా ముఖంలో సంతోషం కనపడకుండా ముగించారు. అనంతరం సభాపతిని మర్యాద పూర్వకంగా కలిసి కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. హాలులోకి వచ్చిన సండ్ర తోటి సభ్యులతో కొద్దిసేపు చిట్చాట్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలో ఉండి 26 పంచాయతీలను ఏకగ్రీవం చేసినట్టు తెలిపారు. తాను ఏది చేసినా ప్రజాస్వామ్య బద్ధంగానే చేస్తానని, తాను ప్రజల నుంచి వచ్చిన నాయకుడినని, పార్టీ మారాల్సి వస్తే ప్రజలకు చెప్పే మారతానన్నారు. తాను ప్రగతిభవన్కు వెళ్తే తప్పేంటన్నారు. ప్రజల నుంచి వచ్చా, ప్రజల మధ్యనే ఉంటా, ప్రజలకు చెప్పే చేస్తా, దొంగచాటుగా చేయాల్సిన అవసరం నాకు లేదంటూ వ్యక్తీకరించారు. ఈ విధమైన సంభాషణ, ప్రమాణ స్వీకారం వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 3 రోజులుగా సండ్రపై వస్తున్న వదంతులకు ఈ చిట్చాట్, ప్రమాణ స్వీకారం పార్టీ మారుతున్నట్టు ఇచ్చిన సమాధానంగా అర్థమవుతోంది.