Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
- సాయంత్రానికే ఫలితాలు..
- 167 పంచాయతీలకు 446 మంది అభ్యర్థులు
- 1458 వార్డులకు పోటీలో 3215 మంది అభ్యర్థులు
- ప్రశాంత ఎన్నికకు సహకరించండి : కలెక్టర్, సీపీ
నవతెలంగాణ-ఖమ్మం ప్రతినిధి
ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. నెలరోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్న అభ్యర్థులు నేడు జరిగే పోలిం గ్లో తమ భవితవ్యాన్ని పరీక్షిం చుకోనున్నారు. ఇందుకుగాను మరికొద్ది సేపట్లో ఖమ్మం జిల్లాలో పంచా యతీ సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్ని కకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొనసాగుతుంది. అనంతరం పోలైన ఓట్ల లెక్కింపు పూర్తిచేసి సాయంత్రానికి తుదిఫలితాలు వెల్లడించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
జిల్లాలో తొలి విడత పోలింగ్ నిర్వహించనున్న కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ, కామేపల్లి మండలాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మండలాల్లోని 188పంచాయతీలకు, అందులోని 1736వార్డు సభ్యుల ఎన్నికకు ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ఏకగ్రీవం అయిన 21 పంచాయతీలు పోను మిగిలిన మొత్తం 167 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులకు నేడు పోలింగ్ జరుగనుంది. దీంతో పాటు జిల్లాలోని ఇదే ఆరు మండ లాల్లోని 1736 వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించి జిల్లాలో 275వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1458వార్డులకు గాను 3215 మంది అభ్యర్థులు నేడు జరిగే ఎన్నికల్లో పోటీలో ఉన్నారు.
144సెక్షన్ విధింపు..మద్యం దుకాణాలు బంద్
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు జరిగే తొలిదశ పోలింగ్ సందర్భంగా ఆయా మండలాల్లో 144సెక్షన్ విధించినట్టు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేడు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టిపోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. అందుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని మొహరించినట్టు వెల్లడించారు. కాగా జిల్లాలో మూడు విడతల్లో ప్రతీ విడతకూ రెండు రోజులు జిల్లాలో మద్యం దుకాణాలు మూసేయాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఏ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయో ఆయా మండలాల్లో దశల వారీగా మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశించారు. ఈ లెక్కన మొదటి దశ ఎన్నికలు జరిగే నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కూసుమంచి, కామేపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాల్లో 19వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నేడు సాయంత్రం ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు పూర్తయ్యేంత వరకు మద్యం దుకాణాలు మూసివేశారు. ర్యాలీలకు అనుమ తుల్లేవని అధికారులు వెల్లడించారు.
నేడు జరిగే పోలింగ్లో ఆరు మండలాల్లోని పంచాయతీ అధికారుల అప్రమత్తం..
జిల్లాలో నేడు జరుగనున్న పంచాయతీ పోలింగ్ను సజావుగా ముగించేందుకు అధికారులంతా అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఏమాత్రం అవాంతరాలకు తావివ్వకుండా, సమస్యాత్మక ప్రాంతాల్లోనూ సజావుగా పోలింగ్ ప్రక్రియ పూర్తిచేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా ఈ ఎన్నికలకు జిల్లాకలెక్టర్ ఆర్వీకర్ణన్ జిల్లా ప్రధాన ఎన్నికల అధారిటీగా వ్యవహరిస్తారు. జేసీ ఆయేషా ఆదనపు ఎన్నికల అధారిటీగా వ్యవహరిస్తారు. సీఈఓ, డీపీఓ శ్రీనివాసరెడ్డి కూడా జేసీతోపాటే అదనపు ఎన్నికల అధారిటీగా విధుల్లో ఉంటారు. సబ్కలెక్టర్, ఆర్డీఓ డిప్యూటీ జిల్లా ఎన్నికల అధారిటీగానూ, ఎంపీడీఓ, తహసీల్దార్లు సహాయ జిల్లా ఎన్నికల అధారిటీగా విధులు నిర్వర్తించాల్సిఉంటారు. ఇదిలా ఉండగా పోలీస్ అధికారులు సైతం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. ఇప్పటికే సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెంచి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు..
మొత్తం పోలింగ్ స్టేషన్లు-5338
తాత్కాలిక పద్దతిలో ఎర్పాటుచేసిన స్టేషన్లు-56
ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటుచేసిన స్టేషన్లు-750
ప్రయివేటు భవనాల్లో ఏర్పాటుచేసిన స్టేషన్లు-17
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు-1666
అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు-1227
క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు-432
పోలింగ్ స్టేషన్లు-1736
ప్రిసైడింగ్ అధికారులు-1736
ఇతర పోలింగ్ అధికారులు-3720
జిల్లాలో పోలింగ్ అధికారుల వివరాలు...
రిటర్నింగ్ అధికారులు-స్టేజ్-1-197మంది
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుస్టేజ్-1-197
రిటర్నింగ్ అధికారులు-స్టేజ్-2-584
జోనల్ అధికారులు-40
రూట్ అధికారులు-247
పోలింగ్ అధికారులు-5338
అదనపు పోలింగ్ అధికారులు-11,546
మైక్రో అబ్జర్వర్లు- 158 నుంచి -1227 పోలింగ్ స్టేషన్ల పర్యవేక్షణ
అధికారులకు వాహనాల ఏర్పాట్లు
కార్లు, జీపులు-108
మినీ బస్సులు-90
పెద్దబస్సులు-258
బ్యాలెట్ బాక్సుల వివరాలు...
మొత్తం బ్యాలెట్ బాక్సులు-4870
పెద్దబాక్సులు-3684
మీడియం బాక్కులు-538
చిన్నబాక్సులు-648
రిపేర్లకు అవకాశంలేని బాక్సులు-456 ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు సరఫరా చేశారు.
సర్పంచ్అభ్యర్థుల వివరాలివి..
మండలం మొత్తం ఏకగ్రీవం మిగిలినవి పోటీలో ఉన్నవారు
కూసుమంచి 41 03 38 105
టీ.పాలెం 40 03 37 107
ఖమ్మం రూరల్ 26 01 25 68
ముదిగొండ 25 02 23 59
నేలకొండపల్లి 32 05 27 69
కామెపల్లి 24 07 17 38
మొత్తం 188 21 167 446
పోటీలో ఉన్న వార్డు సభ్యుల వివరాలిలా ఉన్నాయి..
మండలం మొత్తం ఏకగ్రీవం మిగిలినవి పోటీలో ఉన్నవారు
కూసుమంచి 364 61 303 642
టీ.పాలెం 356 50 306 696
ఖమ్మం రూరల్ 252 15 237 564
ముదిగొండ 246 32 213 451
నేలకొండపల్లి 300 54 245 527
కామెపల్లి 218 63 154 335
మొత్తం 1736 275 1458 3215