Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేసీ అయేషా మస్రత్ ఖానం
- లకారం ట్యాంక్బండ్ వద్ద సైకిల్ ర్యాలీ
నవతెలంగాణ- ఖానాపురంహవేలీ
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆదివారం నగరంలోని స్థానిక లకారం ట్యాంక్ బండ్ వద్ద సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు. పెట్రోల్ వినియోగం తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. సైకిల్ తొక్కడం వల్ల విద్యార్థులకు శారీరకంగా,మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, పెట్రోల్బంకు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జనవరి 1, 2019 నాటికి 18 ఏండ్లు వయస్సు నిండిన అర్హులైన వయోజనులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, నగరపాలక సంస్థ కమిషనర్ జే.శ్రీనివాసరావు, పౌరసరఫరాల అధికారి సంధ్యారాణి, ఇన్చార్జి రెవెన్యూ అధికారి మదన్గోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి మదన్మోహన్, ఏసీపీ సదానిరంజన్, పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, జిల్లా క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, హెచ్పీడీజీఎం చంద్రమౌళి, హెచ్పీసీఎల్ ప్రతినిధులు పురుషోత్తంనాయుడు, సురేష్, కటకం రాము తదితరులు పాల్గొన్నారు.