Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
మాజీ సైనికులకు వైద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ విడోస్ అండ్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షులు కేఎస్ ఫ్రాన్సిస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరం లోని స్థానిక బోనకల్ క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న విజ్ఞాన్ స్కూల్లో ఆదివారం ఆ అసోసియే షన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కేఎస్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ విద్యా, ఉద్యోగ అవకాశాలతో పాటుగా వైద్య(ఈసీహెచ్ఎస్) సౌకర్యాల విధివి ధానాల గూర్చి సమావేశంలో చర్చించారు. అనంతరం జనరల్ బాడీలో కొత్త సభ్యులను ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్గా జి.గోపాల్రా వు, జనరల్ సెక్రెటరీగా సూరేపల్లి యుగేందర్, ట్రెజరర్గా ఎం.చారి, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎస్కే. జావిడ్, హన్మంతరావు, శ్రీహరి, రమేష్, పద్మావతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా వై.విక్రమ్ల ను ఎన్నుకున్నారు.