Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని పెద్ద మునగాల గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని వైరా ఏసీపీ దాసరి ప్రసన్న కుమార్ ప్రారంభిం చారు. గ్రామ సర్పంచ్ పరికపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఖమ్మం ప్రయివేటు ఆస్పత్రికి చెంది న వైద్యులు గోపగాని సురేందర్ గౌడ్, పోట్లపల్లి కిషోర్ గౌడ్, మూర్తిబాబు, పృద్వీ రోహిత్ వ్యాధి గ్రస్తులకు వైద్య సేవలు అందించారు. పెద్ద మునగాలతో పాటు రెడ్డిగూడెం, గోపారం తదిత ర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వ్యాధి గ్రస్తులు వచ్చి వైద్య సేవ లు పొందారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఏసీపీ పాఠశాలలో మొక్క లు నాటారు. ప్రస్తుతం విష జ్వరాల బారినపడి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతు న్న జ్వర బాధితులకు వైద్య శిబిరం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ గోసు మధు, జెడ్పీటీసీ పోట్ల కవిత, ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, గ్రామ ప్రత్యేక అధికారి శరత్ పాల్గొన్నారు.