Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ నవతేజ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-02కు చెందిన విద్యార్థులు ఆదివారం సమ్మేళనం నిర్వహిం చారు. ఈ సమ్మేళనంలో తమ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈ ఓ మద్దినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్ధులు ముదిగొండ జెడ్పీహెచ్ఎస్లో మాజీ రాష్ట్రపతి అబ్ధుల్కలాం విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్ర మంలో అలనాటి ఉపాధ్యా యులు అనంతరా ములు, శైలజ, అనసూయ, చంద్రకళ పాల్గొని మనోభావాలు తెలియజేశారు. పూర్వ విద్యార్ధుల సంఘ నాయకులు షేక్.అన్వర్, మల్లెల ఉపేందర్, ఎం.సతీష్, కె.రాంబాబు, శ్రీనివాస్, కె.మల్లేష్, పి.సురేష్, టి.రాజేష్ పాల్గొన్నారు.