Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లిరూరల్
వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న సమ్మెలో భాగంగా సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి వ్యవసాయ కార్మికులు సమ్మె పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో వ్యవసాయ కార్మికుల ముఠా మేస్త్రీలతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాకర్లపల్లిలో వ్యకాస మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లా డారు. వ్యవసాయ కూలీలకు శ్రమకు తగిన కూలి ఇవ్వడం లేదని, నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా కూలిరేట్లు పెంచా లని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలక తీతంగా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి కేవీపీఎస్ నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, ముఠా మేస్త్రీలు నాగమణి, నిర్మల, సుజాత, సావిత్రి పాల్గొన్నారు.
చింతకాని : వ్యవసాయ కూలీల రోజు వారి కూలీ పెంచాలని కోరుతూ మండల పరిధిలోని కొదుమూరు గ్రామంలోని వ్యవసాయ కూలీల పిలుపు మేరకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సభ్యులు వత్సవాయి జానకిరాములు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నకనబో యిన సుజాత, ఎంపీటీసీ నారపోగు హేమకు ఆదివారం గ్రామంలోని వ్యవసాయ కూలీలు సమ్మే నోటిసు అందజేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు తగ్గట్టు ఇస్తున్న కూలీల చాలా తక్కువన్నారు. కొన్ని గ్రామాల్లో రైతులు తమ ఇష్టానుసారంగా కూలీ రేట్లు చెల్లిస్తున్నారన్నారు. రోజువారి కూలీ 200 ఇవ్వాలని, మొక్కజొన్న విరిస్తే రూ.300, అదే విధంగా బురద పని ఐతే రూ.350 ఇవ్వాలని వారు వినతిపత్రంలో పేర్కోన్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలని, రైతులు కూడా ఈ విషయాన్ని సాదరంగా స్వాగతించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహిళా కన్వీనర్ చెరుకుమల్ల కుమారి, గ్రామ వ్యవసాయకార్మిక సంఘం సభ్యులు బందెల వెంకమ్మ, అచ్చమ్మ, రేణుక, ముత్యాలమ్మ, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.