Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని చిరునో ముల గ్రామంలో పారిశుద్య పనులు నిర్వహిస్తున్నారు. 10 రోజులుగా అధికారులు, చిరునో ముల సర్పంచ్ ములకారపు రవి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పనులు చేస్తున్నారు. గ్రామంలో ఆవాస ప్రాంతాల మధ్య ఉన్న పెంట దిబ్బలను, చెత్తాచెదా రాన్ని తొలగిస్తూ గ్రామాన్ని శుభ్రం చేస్తున్నారు. మొదటి రెండు, మూడు రోజులు కొంతమంది గ్రామస్తులు ఈ పారిశుద్య పనుల కార్యక్రమంలోకి దిగారు. ఆ తర్వాత ఆసక్తి చూపడం లేదు. దీంతో సర్పంచ్ రవి ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుధ్య పనుల్లో నిమగమయ్యాడు. ఎవరు వచ్చినా రాకపోయినా తాను మాత్రం స్వయంగా పనులు చేస్తూ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్వచ్ఛ భారత్ రిక్షాను తన వెంట తీసుకొని వీధుల్లో, ఆవాస ప్రాంతాల మధ్యలో ఉన్న చెత్తా చెదారాన్ని, పిచ్చి మొక్కలు ఏరుతున్నాడు. ఒక సర్పంచ్ స్వయంగా వీధుల వెంట తిరుగుతూ గ్రామస్తులు పడేసిన చెత్తా చెదారాన్ని తొలగించడం పట్ల ప్రతి ఒక్కరు అభినందనలు తెలుపుతున్నారు.
చింతకాని : ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో రూపొందించిన పనులను సకాలంలో పూర్తిచేయాలని జెడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిషోర్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం సర్పంచ్లకు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు సమావేశం వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంధర్బంగా కిషోర్ మాట్లాడుతూ. ప్రత్యేక ప్రణాళిక పనులు ఇంకా కొన్ని రోజులే ఉందని ఇప్పటికే పూర్తి చేసిన పనులు కాకుండా ప్రణాళికలో రూపోందించిన మిగతా పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దావులూరి లలితకుమారి, తహసీల్దార్ కే సత్యనారాయణ, అన్ని గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
కూసుమంచి : మండలంలోని పలు గ్రామాలలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా,ఆదివారం గోరీలపాడుతండా, చేగొమ్మ, గంగాబండతండా, కూసుమంచి, గట్టుసింగారం, మల్లేపల్లి, పాలేరు, నర్సింహులగూడెం, గైగోళ్ళపల్లి, చౌటపల్లి, నాయకన్గూడెంతో పాటు పలు గ్రామాల్లో రోడ్డు పక్కనవున్న పిచ్చిచెట్లును తొలగించడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల మందు పిచికారి చేయడం, బజారులను శుభ్రపరడం తదితర పరిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్పెషల్ అధికారులు, ఎల్త్ ఆఫీసర్స్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, ఫిల్డ్ అసిస్టెంట్లు పాలొన్నారు.