Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
వ్యవసాయ కూలీల న్యాయ పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం మద్దతుగా నిలుస్తుందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు సత్యనారాయణ ప్రకటిం చారు. కారేపల్లిలో రోజు కూలి రూ.200 ఇవ్వాలని డిమాండ్తో వ్యవసాయ కూలీలు చేస్తున్న సమ్మెకు ఆదివారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతన జీవోను అమలు చేయాలని, కొన్ని గ్రామాల్లో రూ.200 ఇస్తుండగా కారేపల్లిలో అమలుకాకపోవటం బాధకరమన్నారు. సమ్మెలో పాల్గొంటున్న కూలీలను కొందరు ప్రజాప్ర తినిధులు బెదిరిస్తున్నారని అలాంటి చర్యలకు భయపడేది లేదన్నారు. కూలికి రాకుండా పంపు కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కూలీలను అగౌరవంగా మాట్లాడాన్ని ఆయన అభ్యంతర వ్యక్తం చేశారు. సామరస్య పూర్వకంగా కూలి న్యాయమైన డిమాండ్ను అర్థం చేసుకోని ఒప్పందాలు చేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వ్యకాసం నాయకులు కే.నాగేశ్వరరావు, వజ్జా రామారావు, ముండ్ల ఏకాంబరం, పాసిన్ని నాగేశ్వరరావు, వాసిరెడ్డి సంపత్ ముఠా మేస్త్రీలు పాల్గొన్నారు.
ముదిగొండ : వ్యవసాయ కూలీలకు కనీస వేతన చట్టం ప్రకారం రోజుకు రూ.400 అమలయ్యే వరకు కూలీలు పోరాడాలని సీపీఐ న్యూడెమొక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి సీవై పుల్లయ్య, ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి పగిడికత్తుల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం ముదిగొండలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలీ చాలక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు తమ పంటలకు గిట్టుబాటు ధరల పెంపుకై పోరాడాలన్నారు. 2011లో చేసిన కనీస చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు పగిడికత్తుల వెంకటేశ్వర్లు, ఆర్.యోహాన్, కొలికపొంగు సీతారాములు, చిర్రా బిక్షం, బచ్చలకూరి ఏసోబు పాల్గొన్నారు.