Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
తల్లికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... ఘనపారపు వీరయ్య-వెంకట్రావమ్మలు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారం రోజుల క్రితం వెంకట్రావమ్మకు జ్వరం రావడం తో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య చికిత్స పొందుతూ పరిస్ధితి విషమించి శనివారం మృతి చెందింది. మృతురాలికి కుమారులు లేకపోవడంతో ఆమె చిన్న కూతరు జ్యోతి తల్లికి తలకొరివి పెట్టి తన రుణం తీర్చుకుంది.