Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామేపల్లి
మండల పరిధిలోని తాళ్ళగూడెం రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 574లో 24కుంటలను శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుకు రెవెన్యూ అధికారులు పంచాయతీకి అప్పగించినట్టు ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, సర్పంచ్ లకావత్ సునీతలు తెలిపారు. ఆదివారం తాళ్ళగూడెంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. త్వరలో పనులు ప్రారంభించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, రంగ, గ్రామస్థులు పాల్గొన్నారు.