Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్టీయూ ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
రాష్ట్రంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సదానందం గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం లోని రస్తాగీనగర్ హై స్కూల్లో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకుపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, పీఆర్సీ, ప్రమోషన్లను వెంటనే చేపట్టాలని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు మాధవరావు మాట్లాడుతూ సీపీఎస్ రద్దును వెంటనే చేపట్టాలన్నారు. అర్హత గల స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్ పదోన్నతులు పొందటాఇకి జీవో 302ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.బాబు, రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు భుజంగరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు రంగయ్య పాల్గొన్నారు.