Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
యూరేనియం తవ్వకాల పేరుతో పచ్చని దట్టమైన నల్లమల అడవులను అందులో దాగి ఉన్న అనేక జీవ జాతులను, ఔషధాలను అడవి ఉత్పత్తులను వాటినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీ, చెంచు అడవి బిడ్డల జీవించే హక్కును విధ్వంసం చేయకూడదని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. నగరంలోని స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం న్యాయవాది ఎన్.రవీందర్ చేపట్టిన ''స్టాప్ యూరేనియం'' సేవ్ నల్లమల'' అనే ప్రచార సంఘీభావ పోస్టర్ను ఆయన ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇఫ్ట్ జిల్లా కార్యదర్శి జి.రామయ్య, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి ఎన్.ఆజాద్, ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు సంజీవ్, శివ లింగం, శ్రీనివాస్, పీడీఎస్యూ నాయకులు కిరణ్, వెంకటేష్, టీపీటీఎఫ్ మాజీ నాయకులు రవి కుమార్లు పోస్టర్ ఆవిష్కరించారు.