Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
లారీ ఢకొీని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని తాళ్లమడ వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... నాగేశ్వరరావు(50) అనే వ్యక్తి తన మోటారు సైకిలుపై సత్తుపల్లికి వచ్చి అక్కడ కూరగాయలు కొనుక్కొని తిరిగి తాళ్లమడకు వెళ్తున్న క్రమంలో తాళ్లమడ వద్ద రోడ్డు పక్కగా ప్రమాదకరంగా రోడ్డు పక్కగా ఆపి ఉన్న కంటెయినర్ను దాటుకొని ముందుకు వెళ్తున్న క్రమంలో రాజమండ్రి వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ నాగేశ్వరరావును ఢకొీంది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలవడంతో వెంటనే అతడ్ని సత్తుపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సత్తుపల్లి పోలీసులు క్షతగాత్రుడ్ని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను తెలుసుకొని విచారణ చేపట్టారు.