Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీధులన్నీ బురదమయం
- గ్రామాల్లో తీవ్రమైన దోమల బెడద
- పట్టించుకోని పాలకులు
నవతెలంగాణ-ముదిగొండ
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక పనులు అసం పూర్తిగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తు న్నాయి. అసలే వర్షాకాలం... వీధులన్నీ బురదమ యమై కాలినడడకు తీవ్ర ఆటకంగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. దీనికి తోడు దోమల బెడద ఎక్కువైందని, ఫాగింగ్ చేయడంలో పంచా యతీ పాలకులు, అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 30రోజుల ప్రణాళికా పనులు చేపట్టారని, ముది గొండ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లేదనే ఆరోపణలున్నాయి. ఫలితంగా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. ప్రతీయేటా వర్షాకాలం సీజన్లో దోమల నివారణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేదని, ఈ ఏడాది పట్టించుకున్న దాఖలాల్లేవని, ఫలితంగా ప్రజలు విషజ్వరాలు, డెంగ్యూ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల పరిధిలోని పెద్ద మండవలో అనేక సమస్యలు ఏండ్ల తరబడి పేరుకుపోయి ఉన్నాయని, గ్రామంలో అంతర్గత రహదారు లు బురదమయమై కాలినడడకు ఇబ్బందిగా ఉందని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి 30రోజుల ప్రణాళిక పనులు చేపట్టినట్టు చెబుతున్నా క్షేత్రస్థాయిలో సమస్యలు అలాగే ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దమండవ గ్రామం మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అభివృద్ధికి ఆమడదూరం, అసౌకర్యాలకు నిలయంగా మారి ప్రజలు అనేక పాట్లు పడుతున్నారు. మండల అధికారులు ఎవరూ గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. ప్రధానంగా దళితకాలనీలో వర్షం వస్తే రోడ్లన్నీ బురదమయమై కాలు పెట్టడానికి వీలు లేకుండా పోయి అధ్వానంగా తయారైంది. పారిశుద్యం లోపించి ప్రజలు అనారోగ్యానికి గురై అవస్ధలు పడుతున్నారు. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు మంజూరైనా వాటి నిర్మాణాన్ని చేపట్టే వారు లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు, పంచాయతీ పాలకవర్గం ఇప్పటికైనా స్పందించి 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో చిత్తశుద్ధితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.