Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపయోగంగా మూలనపడ్డ వైనం
- పంచాయతీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం
- చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని ప్రజల వేడుకోలు
నవతెలంగాణ-ఎర్రుపాలెంరూరల్
దేశాభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలంటారు... అలాంటి పల్లెలకు నేడు జబ్బు చేసి ఆచేతనంగా మారిపోయాయి. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన చెత్త తరలించే రిక్షాలు కదలడం లేదు. నిరుపయోగంగా మూలన పడి ఉంటున్నాయి. ఫలితంగా చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యానికి దూరంగా ఉందని చెప్పొచ్చు. ఒక్క మండల కేంద్రంలో మినహాయించి మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ చెత్త తరలించే రిక్షాలు మూలనపడి ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్డబ్ల్యుఎస్ నిధులతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో చెత్తాచెదారాన్ని తీసుకొని డంపింగ్ యార్డుకు తరలించేందుకు ప్రతీ పంచాయతీకి రిక్షాలను పంపిణీ చేసింది. మండలంలోని 31గ్రామ పం చాయతీలకు గానూ చిన్న పంచాయతీకి ఒక బండి, పెద్ద పంచాయతీ అయితే నాలుగు బండ్ల చొప్పున మొత్తం 58రిక్షా బండ్లను పంచాయతీ లకు కేటాయించారు. ఒక్కో రిక్షా ఖరీదు రూ.12వేలు కాగా 58రిక్షాలకు రూ.6లక్షల 96వేల వ్యయంతో వాటిని కొనుగోలు చేసి పంచాయతీలకు అప్పగించారు. బండ్లు వచ్చిన కొత్తలో నెలరోజుల పాటు వాడి పక్కన పడేశారు. ప్రస్తుతం ఆ బండ్లను పంచాయతీలు వినియో గించుకోకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.
గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం...
గ్రామాల్లో చెత్త తరలించే రిక్షాలు మూలన పడడంతో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకు పోతోంది. డంపింగ్ యార్డుకు తరలించేందుకు పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆరకొర నిధులతో కునారిల్లుతున్న పంచాయతీలకు కార్మికులను కేటాయించి చెత్త తరలించాలంటే భారమవుతోందని వాపోతున్నా రు. లక్ష్యం ప్రకారం చెత్త రిక్షాలను ఉపయోగిం చుకొని ఉంటే వర్షాకాలంలో ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని, గ్రామాల్లో మలేరియా, డెం గ్యూ, విషజ్వరాల బారిన పడి ప్రజలు చనిపో యేవారు కాదని గ్రామస్థులు అంటున్నారు. ప్రభుత్వాలు కేవలం ప్రచార ఆర్భాటాలే తప్పా ప్ర జావసరాలు గుర్తించి పని చేయడం లేదనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూత నంగా 30రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా పంచాయతీల్లో ప్రజాప్రతి నిధులను, అధికారులను, ప్రజలను సమన్వయం చేసి చెత్త తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చెత్త బండ్లకు ఇద్దరు కార్మికుల చొప్పున నియమించి ఊరి బయట డంపింగ్ యార్డుకు తరలించేలా చూడాలని వేడుకుంటున్నారు.
రిక్షాలు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం : బీ.భద్రు (ఎంపీడీఓ, ఎంపీడీఓ)
చెత్త లాగే బండ్లను రిపేర్ చేయించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. చెత్తను రోజూ డంపింగ్ యార్డ్కు తరలించేందుకు పంచాయతీ సిబ్బందితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. ఉపాధి హామీ పథకం కింద కార్మికులను నియమించి నెలకు రూ.3600ల చొప్పు వేతనం ఇచ్చి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాం.
నిధుల్లేక నీరసిస్తున్న పంచాయతీలు.. : వేమిరెడ్డి సుధాకర్రెడ్డి (రాజుదేవరపాడు సర్పంచ్)
వేలకు వేలు ఖర్చు చేసి పంచాయతీలకు పంపిణీ చేసిన చెత్త బండ్లు నిరుపయోగంగా మారాయి. చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు అవసరమైన కార్మికులను ప్రభుత్వం నియమించకపోవడంతో ప్రస్తుతం పంచాయతీల్లో ఎందుకు పనికి రాకుండా మూలన పడ్డాయి. పంచాయతీలకు నిధుల్లేక అచేతనంగా మారాయి. నిధులు కేటాయించి, కార్మికులను నియమించాలి.
కార్మికులు లేక నిరుపయోగం.. : మూల్పూరి స్వప్న (జమలాపురం సర్పంచ్)
గ్రామాల్లో చెత్త తరలించేందుకు ప్రభుత్వం బండ్లు అయితే పంపిణీ చేసింది. కానీ చెత్త తరలించే కార్మికులను నియమించకపోవడంతో ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారాయి. 30రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్యంపై దృష్టి పెట్టి చెత్త రిక్షాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం.