Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురంహవేలీ
ఖమ్మం నగరంలోని టీఎన్జీఓ ఎస్ ఫంక్షన్ హాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో 'పర్యావర ణ పరిరక్షణ' అవగాహన సదస్సు ఆ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీవిద్య, శ్రీధర్ ప్రారం భించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా ఖమ్మం నగర మేయర్ డాక్టర్ పాపాలాల్, అసిస్టెంట్ కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీఐఈఓ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయ ర్ పాపాలాల్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్లాస్టిక్ నిషేదానికి అందరి సహకారం అవసరం అన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ ఆదర్శ సురభి విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ... ఖమ్మం పట్టణంలో జనాభా బాగా పెరిగిందని, ప్లాస్టిక్ వాడకం కూడా విపరీతంగా పెరిగిందన్నారు. అనంతరం విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ విద్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ఎం.సాయి గీతిక, డీజీఎం, డీన్ జి.సత్యనా రాయణ, అకడమిక్ డీన్ వర్మ, ఎంజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జీ.ప్రకాశ్, జీ.గోపాలకృష్ణ పాల్గొన్నారు.