Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక పక్షపాతి జీఎం వీరస్వామి
- మాజీ ఎమ్మెల్యే మదన్లాల్
నవతెలంగాణ-కారేపల్లి
సింగరేణి కాలరీస్ సంస్థ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్గా పని చేసి ఈనెల చివరిలో ఉద్యోగ విరమణ చేయ నున్న జీఎం హన్మకొండ వీరస్వామికి ఆది వారం గేటుకారే పల్లిలో ఘన సన్మానం నిర్వ హించారు. కారేపల్లి మండలం గేటుకారే పల్లికి చెందిన హన్మకొండ వీరస్వామి సింగరేణి కాలరీస్లో అంచలంచేలుగా జీఎం స్థాయికి ఎదిగారు. ఉద్యోగ విరమణ చేయ నున్న జీఎం వీర స్వామికి గేటుకారేపల్లి గ్రామస్తు లు, కుటుంబ సభ్యులు సన్మానం ఆదివారం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి వైరా మాజీ ఎమ్మె ల్యే బానోత్ మద న్లాల్ హాజరై జీఎంను సన్మా నించి అభినందనలు తెలిపారు. ఈ సంధర్బంగా మదన్లాల్ మాట్లాడు తూ క్రమశిక్షణ, అంకిత భావం కల్గిన వ్యక్తి జీఎం హన్మకొండ వీరస్వామి అని, మారుమూల గ్రామంలో జన్మించి పట్టుదల తో ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. వామపక్ష భా వాజలం కల్గి ఉండి కార్మికుల పక్షాన నిలబడిన కార్మిక పక్షపాతి అని కొనియాడారు. ఈ సందర్బం గా జీఎం హన్మకొం డ వీరస్వామి మాట్లాడుతూ చిన్నతనం నుండి వామపక్ష భావాజలం కల్గి ఉండ టంతో క్రమశిక్షణ కు అలవాటి పడిందని, కారేపల్లి హైస్కూల్లో విద్యాభ్యాసం జరిగిందని, అలనాటి గురువుల ఆశీర్వాదం, స్నేహితుల తోడ్పాటుతో ఈ స్ధాయికి ఎదిగినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమం లో జడ్పీటీ సీ వాంకుడోత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీని వాసరావు, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ హన్మకొండ రమేష్, ప్రముఖన్యాయ వాది నర్సింగ్ శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీలు ఉన్నం వీరేందర్, ముత్యాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పగ డాల మంజుల, మాజీ సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీని వాసరావు, సర్పంచ్లు భూక్యా రంగారావు, ఈసం అరుణ, ఎంపీటీసీ దారావత్ పాండ్యానాయక్ పాల్గొన్నారు.