Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాలపై యువత ఉద్య మించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు. ఆదివారం నేలకొండ పల్లి మండల కేంద్రంలో డీవైఎఫ్ఐ 12వ మం డలం మహాసభ ఆ సంఘం మండల అధ్యక్షుడు కణతల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం లో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ యువతకు ఉద్యోగా లు, ఉపాధి పేరుతో మోసం చేశారని విమర్శించా రు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కారన్నారు. ఇప్పటికైనా యువత మేల్కొని ఓటు రాజకీయాల చేస్తున్న పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని, ప్రభు త్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు, వారి మెడలు వంచే విధంగా నిర్వహించే పోరాటంలో భాగస్వా ములవాలన్నారు. రాష్ట్రంలో యురేనియం తవ్వకా లు వల్ల నల్లమల అడవి తో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం అభ్యుదయవాదులు ప్రజలు అందరూ డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో సేవ్ నల్లమల నినాదంతో చేపట్టిన ఈ పోరాటానికి ఐక్యంగా కలిసి రావాలని పిలుపుని చ్చారు. ఇప్పటికే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి లక్షమంది ప్రజలు స్పందించారని అనేక మంది సెలబ్రిటీలు సైతం ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలియజేస్తున్నా రన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. సీఐటీయూ జిల్లా నాయ కులు పగిడికత్తుల నాగేశ్వరావు మాట్లాడుతూ యువత మంచి మార్గంలో పయనించేందుకు డీవైఎఫ్ఐ చేస్తున్న క షి అభినందనీయమన్నా రు. అనంతరం సేవ్ నల్లమల నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రావెళ్ల భవనం నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా పెట్రో ల్ బంకు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రధాన కేంద్రానికి చేరుకున్నారు. మహాసభలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కణతల వెంకటేశ్వ ర్లు, బొడ్డు మధు, నాయకులు శ్యామల సురేందర్, రేగళ్ల వీరబాబు, శ్రీకాంత్, తరుణ్, వెంకటేశ్వర్లు, శ్రీను, ఉపేందర్, హనుమంతరావు పాల్గొన్నారు