Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ కవి, సాహితీవేత్త మువ్వా శ్రీనివాస్
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
సాహిత్యమే ప్రజా జీవన ప్రతిబింబం అని ప్రముఖ కవి, సాహితీవేత్త మువ్వా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఖమ్మంలోని పీఆర్టీయూ జిల్లా కార్యాలయంలో భువన విజయం తెలుగు సాహిత్య వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో మూడో కన్ను - కావ్యదర్శనం, అమ్ములపొది, జ్ఞాపకాలగవ్వలు, వెలుగుబాట పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాణా ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మువ్వ మాట్లాడుతూ కాలం చైతన్యవంతంగా సాగుతుందని, సాహిత్యం దానికి ప్రేరకంగా సమాజ స్థితిగతులకు అద్దం పట్టాలని సూచించారు. మరో అతిథిసోమేపల్లి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సాహిత్యంలో కవి, విమర్శకుల పాత్ర గురుతరమైనదని గుర్తు చేశారు. ఎందుకు రాస్తున్నాం.. ఏం రాస్తున్నాం..? అనే విషయా న్ని కవులు నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవా లన్నారు. ప్రముఖ విద్యావేత్త కృష్ణమోహన్ మాట్లాడుతూ కవికి, పాఠకునికి అందని లోతుపాతులను, గణదోషాలను నిష్పక్షపాతంగా విశ్లేషించేవాడే నిజాయితీ గల విమర్శకుడని అభిప్రాయపడ్డారు. మూడో కన్ను కావ్యాన్ని పోతగాని సత్యనారాయణ సమర్దవంతంగా, సహృదయంగా విమర్శించా రని, ఆయన రచించిన మూడోకన్ను - కావ్యదర్శనం విమర్శ రంగంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతుందని అభిలషించారు. సమాజ శ్రేయోరచనల ప్రకాశనం, భాష, కళారంగాల అభివృద్దే ధ్యేయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 'భువన విజయం' పని చేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంకాయలపాటి చంద్రశేఖర్ తెలిపారు. ఈ కృషిని మరింత విస్తృతం చేస్తామ న్నారు. ఈసభలో పోతగాని సత్యనారాయణ రచించిన మూడోకన్ను- కావ్యదర్శనం, యన గందుల దేవయ్య, వనం తేజశ్రీ అమ్ములపొదిని కన్నెగంటి వెంకటయ్య, రత్నారెడ్డి జ్ఞాపకాల గవ్వ లు పుస్తకాన్ని రాణా ప్రతాప్, శ్రీపతి వాసుదేవ మూర్తి రచించిన వెలుగు బాటను పోతగాని సత్యనారాయణ పరిచయం చేశారు. ఈ కార్యక్ర మంలో రేళ్ల శ్రీనివాస్, దాసరోజు శ్రీనివాస్, నామా పురుషోత్తం, రాచమళ్ల ఉపేం దర్, ఇబ్ర హీం, తాళ్లూరి రాధ, ఫణిమాధవి పాల్గొన్నారు.