Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గం
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి విష్ణువర్ధన్
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
నగరంలో పని చేస్తున్న జేసీబీ ఆపరేటర్లు, హెల్పర్లు వారి హక్కుల పరిరక్షణకు కార్మిక సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేసే సీఐటీయూలో చేశారు. 150 మంది కార్మికులు ఆదివారం సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మ విష్ణువర్దన్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని మంచికంటి భవన్లో జరిగిన సభలో విష్ణువర్దన్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని తద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. జేసీబీ ఆపరేటర్లకు, హెల్పర్లకు కనీస వేతనం అమలు చేయడం లేదని, వెంటనే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో కార్మికులకు ప్రమాదం జరిగిన ప్పుడు యజమానులు బాధ్యత వహించా లన్నా రు. అలాగే కార్మికులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాల న్నారు. జేసీబీ ఆపరేటర్లకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అమలు చేయాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోటార్ వెహికిల్ కార్మికుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యగా వ్యవహరిస్తున్నాయని వారికి సరైన భద్రత కల్పించడం లేదన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తన మందబలంతో కార్మిక హక్కులను యజమానులకు తాకట్టు పెట్టే పద్దతిలో చట్టాలు తీసుకొస్తుందని విమర్శించారు. మోటార్ వెహికిల్ కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్దమవుతుందన్నారు. ఈ పోరా టంలో కార్మికులందరూ కలిసి రావాలని పిలుపు నిచ్చారు. ఖమ్మం నగరంలో జేసీబీ ఆపరే టర్ల సమస్యల పరిష్కారానికి యజమా నులు చొరవ చూపాలని, సామరస్య పద్దతిలోనే సమస్యలు పరిష్కారం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతనం నూతన కమిటీని ఎన్నుకు న్నారు. అధ్యక్షుడిగా మహేష్, కార్యదర్శిగా వెంకట్, గౌరవాధ్యక్షుడిగా తుమ్మ విష్ణువర్దన్, గౌరవ సలహాదారులుగా బాబా నాగేశ్వరరావు, మరో ఎనిమిది మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీకి సీఐటీయూ జిల్లా కమిటీ శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూజిల్లా ఉపాధ్యక్షుడు ఎం.గోపాల్, టూ టౌన్ కన్వీనర్ కుక్కల గురుమూర్తి, మున్సిపల్ యూనియన్ నాయకులు దొడ్డా నర్సింహారావు పాల్గొన్నారు.