Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదుపు తప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన కారు
- అత్తాకోడలు మృతి...
- మృతురాలు తొమ్మిది నెలల గర్భిణి
- భర్తకు తప్పిన ప్రాణాపాయం
- శోక సంద్రంలో కుటుంబ సభ్యులు
- ఆపరేషన్ చేసి గర్భస్త శిశువు వెలికితీత
నవతెలంగాణ-ఖమ్మం
''వివాహమైన మూడేండ్ల అనంతరం తొలి కాన్పునకు ఇంకా కొద్దిరోజులే సమయం.. పండంటి బిడ్డకు జన్మనిస్తుందనడంతో దంపతుల ఆనందానికి అవదులే లేవు... అంతా సవ్యంగా జరుగుతుందని అనుకునే లోపే భర్త కండ్ల ఎదుటే ఘోరం జరిగిపోయింది... తొమ్మిది నెలల పాటు కడుపులో మోసిన శిశువును చూడకుండానే విధి రాసిన రాతకు భార్య తనువు చాలిచించింది... అదుపు తప్పి కారు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో అత్తతో పాటు కోడలు జలసమాధి అయింది. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాద ఘటన ఖమ్మంరూరల్ మండలం గొల్లగూడెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మహబూబాద్ జిల్లా చినగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన పోగుల మహిపాల్, స్వాతి(28) దంపతులకు వివాహమై మూడేళ్లు అయ్యింది.మహిపాల్ బంగ్లా లో స్థిరపడి విద్యుత్ శాఖలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.ఆ దంపతులకు మొదటి కాన్పు కావడంతో ఖమ్మం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గైనిక్ వద్ద వారానికి ఓ సారి చెకప్ నిమిత్తం వస్తుంటారు.భర్త మహిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.... భార్యకు హై బిపి కావడంతో వారానికి ఓ సారి చెకప్ చేయించాలని డాక్టర్ సలహా మేరకు వస్తువెళ్తుంటారు.భార్య స్వాతి నిండు జులలాలు.దీనిలో భాగంగా శనివారం సదరు హాస్పిటల్ కి వచ్చి వెళ్లారు.డాక్టర్ వ్రాసిన పరీక్షలు సమయానికి రాకపోవడంతో...పరీక్షలకు సంబంధించిన వాటిని డాక్టర్ కు చూపించి మందులు తీసుకొని వెల్దామని ఆదివారం రోజు ఖమ్మం చేరుకున్నారు.వారితో పాటు గా మహిపాల్ తల్లి ఇందిరా(45) కూడా ఆరోగ్యం బాగలేకపోకడంతో ఇరువురితో వచ్చి చూపించుకొని కారు లో ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఏ ఇంటికి తిరుగుముఖం పట్టి కారులో అమ్మ,భార్యలతో కలిసి కారులో బయల్దేరారు.ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం సాగర్ కాల్వ సమీపంలోకి రాగానే భర్త మహిపాల్ బహిర్బుమికి వెళ్లేందుకు కారు ను సాగర్ కాల్వ కట్ట మీద కొద్దీ దూరం వెళ్లి బహిర్బుమీ కార్యక్రమంను ముగించుకున్నాడు.కారు ను వెనుకకు తిప్పే క్రమం లో సాగర్ కాల్వ అంచు భాగంలో కూరుకుపోయి నిండు కాల్వలో పడిపోయింది.అత్త కోడలు సిటు బెల్ట్ ధరించి ఉండటంతో కారు తో పాటుగా మునిగి ప్రాణాలు విడిచారు.మహిపాల్ కూడా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో అటు దిశగా వెళ్తున్న ద్వీ చక్ర వాహనదారులు ప్రమాదం ను గమనించి సమీపంలో బట్టలు ఉతికే ఆమె దగ్గర ఉన్న చీర సహాయంతో మహిపాల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఏ కొద్దీ సేపటి తర్వాత సాగర్ లో మునిగిన కారును జేసిబి సహాయంతో వెలికి తీయడంతో అత్త కోడలు విగత జీవులుగా కనిపించారు.స్వాతి నిండు జులాలు కావడంతో హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.సదరు వైద్యులు శాస్త్ర చికిత్స చేసి గర్భంలో ఉన్న శిశువును రక్షించాలనే వారి ఆశ అవిరయ్యింది.బయటపడ్డ మగ శిశువు మ తి చెంది కనిపించాడు.ఓకే సారి అమ్మ, భార్య,జన్మనిచ్చిన శిశువు మ తి చెందడంతో మహిపాల్ గుండెలవిసేలా రోధించాడు. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.