Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో దాడి చేసి, గాయపరిచిన ఘటన ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రమణగుట్టకు చెందిన రామారావు, జ్యోతి దంపతుల మధ్య గత కొంతకాలంగా వారు ఉంటున్న స్థలానికి సంబంధించి వివాదం నడుస్తోంది. స్థలం నా పేరు మీద ఉందంటే నా పేరు మీద ఉందంటూ గొడవపడుతూ వస్తున్నారు. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు లేఖ రాయగా వారు మంగళవారం సర్వే చేస్తామని చెప్పారు. కాగా రామారావు తన పేరు మీద స్థలం ఉంటుందో ఉండదో అనే అనుమానంతో కత్తి తీసుకుని ఒక్కసారిగా భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనపై కుమార్తె దివ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.