Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని కిన్నెరసాని వాగునుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు టిప్పర్లను సోమవారం అర్థరాత్రి పట్టుకున్నారు. ఈమేరకు ఎస్ఐ ముత్యం రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని సాయనపల్లి కిన్నెరసాని వాగుపై వంతెన నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారులు టిప్పర్ల ద్వారా వచ్చేటప్పుడు కంకరలోడుతో వచ్చి తిరుగు ప్రయాణంలో ఇసుకను ఖమ్మం తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని అందిన సమాచారంతో సోమవారం రాత్రి ఎస్ఐ ముత్యం రమేశ్ సిబ్బందితో కలిసి కిన్నెరసాని వాగు దగ్గరకు వెళ్లి నాలుగు ఇసుక టిప్పర్లను పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.