Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మంరూరల్: జులై 2018 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ నివేదిక కోసం గడువును డిసెంబర్-2020 వరకు పొడిగించిడాన్ని టీఎస్యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి డీఎస్.నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల గొల్లగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 24తో ముగుస్తున్న సమయంలో పి.ఆర్.సి నివేదిక తెప్పించుకోకుండా డిసెంబర్ 31 2020కి గడువు పెంచి మోసం చేస్తున్నారని విమర్శించారు. ఫిట్మెంట్ 45శాతం తగ్గకుండా ఇవ్వాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏండ్లు పెంచాలన్నారు. డీఏ బకాయిలు నేటికి చెల్లించకపోవడం ఉద్యోగుల పట్ల వివక్షకు నిదర్శనమన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని, పెండింగ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి, నిర్మల, శ్రీనివాస్ రావు, బిచ్చా, హాము, నెహ్రూ, భీమా, గోపాలరావు, శివాజీ సుజాత, సరస్వతి, రామారావు, అనూష పాల్గొన్నారు.