Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరానికి చెందిన వడిగ రాజ్కుమార్కు అమెరికాకు చెందిన ఆధ్యాత్మిక యూనివర్సిటీ ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసింది. సికిం ద్రాబాద్లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో సోమవారం రాత్రి వేడుకగా జరిగిన యూనివర్సిటీ గ్రాడ్యూయేషన్ డేలో డాక్టరేట్ ప్రదానం చేశారు. ఓరల్ యూనివర్సిటీకి చెందిన పరిపాలన విభాగం అధిపతి చేతుల మీదుగా రాజ్కుమార్ డాక్టరేట్ను అందుకున్నారు. బైబిల్లోని ఏసుక్రీస్తు ప్రధాన అనుచరుల్లో ఒకడైన యూద ఇస్కరెత్ ఏసుప్రభువును అప్పగించిన విధానం, యూదా ఇస్కరేత్ జీవన శైలిపై రాజు కుమార్ రూపొందించిన పరిశోధనాత్మక వ్యాసం సం పుటికి డాక్టరేట్ లభించింది. రాజ్ కుమార్ను రాష్ట్ర ప్రిన్సి పల్ సంఘం అధ్యక్షులు కేఎస్ రామారావు, రిటైర్డ్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి యడ వల్లి ప్రభాకర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ డైరెక్టర్ డి.సమ్మయ్య, లెక్చ రర్లు శాంతికుమార్, జార్జ్, కవిత, సత్య నారాయణ, జగదీష్, పద్మావతి, రాజేశ్వరరావు అభినందించారు.