Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మర్లపాడు సొసైటీ నూతన చైర్మెన్ కటికల సీతారామిరెడ్డి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామిరెడ్డిని అభినందించి శాలువాతో సన్మానించారు. ఆయన వెంట భరత్ విద్యా సంస్థల అధి నేత, టీఆర్ఎస్ జిల్లా నాయకులు శీలం వెంకటరెడ్డి, మర్ల పాడు సర్పంచ్ వేమిరెడ్డి పెద్దనాగిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చింతకాని: చింతకాని సొసైటీ నూతన చైర్మెన్ కొండపల్లి శేఖర్రెడ్డి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంగళవారం ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించారు. నూతన చైర్మెన్కు పొంగులేటి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. సహకార సంఘంలోని రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం ఆయన జిల్లా టీఆర్ఎస్ నాయకులు తాత మధు, జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావులను వారివారి కార్యాలయాల్లో విరివిగా కలసి ఆశీస్సులు తీసు కున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీ నర్ కిలారు మనోహర్,నాయకులు లక్కిరెడ్డి బాబుల్రెడ్డి, గడ్డం శ్రీను, నన్నక కోటయ్య, రాంబాబు పాల్గొన్నారు.
అయిలూరిని సన్మానించిన మాజీ ఎంపీ పొంగులేటి
ఎర్రుపాలెం: తక్కెళ్లపాడు సహకార సంఘం సొసైటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన అయిలూరి వెంకటేశ్వరరెడ్డిని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని, అందుకు తనవంతుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీనవోలు ఎంపీటీసీ కుడుముల మల్లిఖార్జున్రెడ్డి, ఎస్కె.హుస్సేన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.