Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సారపాక
పినపాక నియోజకవర్గంలో పంచాయతీ అభివృద్ధికి పథంలో నడవాలంటే పంచాయతీల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో బూర్గంపాడు, ఆశ్వాపురం, పాల్వంచ మండలం పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, గుమాస్తాలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి పంచాయతీ అభివృద్ధి చేసేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తుందని, పల్లెల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులతో పాటు పంచాయతీ కార్య దర్శులు కూడా తోడ్పాటు అందించాలని సూచించారు. విధుల్లో ఎవరైనా ఆలసత్వం వహించి నట్లయితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. కలెక్టర్ ఎంవీ.రెడ్డికి పంచా యతీలపై మంచి పట్టుందని, ప్రతి పంచాయతీ పనితీరును ఎప్పటిక ప్పుడు ఆయన పర్యవేక్షిస్తున్నారని, నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే ఆయన తనిఖీలు నిర్వహించే అవ కాశం ఉందని, ప్రతిఒక్కరూ విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్లకు ఇరు వైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ఎల్లప్పుడూ నీటిని అందిస్తే సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. పంచాయతీల్లో జరుగుతున్న, జరిగే పనులను ఎప్పటికప్పుడు కంప్యూటర్ ఆప రటర్లతో కార్యదర్శులు ఆన్లైన్ చేయించుకునే విధంగా చూడాలన్నారు. ప్రధానంగా బూర్గంపాడు, అశ్వాపురం పంచాయతీ కార్యదర్శి ఆన్లైన్ నమోదు లో వెనుకబడి ఉన్నారని, మరోసారి వచ్చే నాటికే ఆన్లైన్ విధానం పూర్తి కావాలని సూచిం చారు. ఈనెల 25లోగా ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్ల కొనుగోళ్లు పంచాయతీల్లో పూర్తి కావాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల పని తీరుపై అసహనంగా మాట్లాడుతున్న డీపీఓను చూసి కూడా కొందరు ఆ మాటలను పెడచెవిన పెట్టడంపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఆర్వీ సుబ్రమణ్యం, పాల్వంచ, అశ్వాపురం ఎంపీఓలు, మూడు మండలాల పంచాయతీల కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, గుమాస్తాలు పాల్గొన్నారు.