Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో నూటికి ఎంతమందికి
నీతిగా అన్నం దొరుకుతుంది?
మనిషి తల్లి కడుపులోనే నీతిగా బతుకుతాడు..!
తల్లిపాలు తాగి పెరుగుతారు.. అయ్య సంపాదనతో అన్నం తిని ఎదుగుతాడు
సమాజంలో తోటి మనిషి దగ్గర అన్యాయం, పాపం నేర్చుకుంటాడు
ఇవన్నీ నేర్చుకుని సమాజాన్ని చెడగొడుతున్నాడు!!
నేటి మానవుడే రేపటి సమాజం..
నీతి, త్యాగం, మంచి, మానవత్వం
అనే మూల స్తంబాలపై నిలవాలి..
ఆ స్తంబాలే లేకపోతే సమాజం కుళ్లిపోతుంది..
అవినీతి బురద గుంతలో
మునిగి నశించి పోతుంది
సమాజానికి సమాది కట్టే నాయకులు మనకొద్దు..
అన్నం బదులు గడ్డి తినే నాయకులు మనకొద్దు..
నీతిగల ప్రజల నాయకులే మనకు ఆదర్శం..
సమాజంలో సామాజిక,
నైతిక విలువలు పడిపోతున్నవి
భార్య, బిడ్డను. కోడల్ని, తల్లిని
దేవతలుగా భావించాలి!
- సబ్బు నాగయ్య,
సెల్ : 95739 96828.