Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పంచాయతీ కార్మికుల కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ కొర్సా చిలకమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మండల కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే దీక్షలు మంగళవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్మికుల కోసం ప్రభుత్వం ఇస్తానన్న రూ.8500 వేతనం వెంటనే చెల్లించడంతో పాటు పీఎఫ్, ఇఎస్ఐ సౌకర్యం కల్పించాల న్నారు. కార్మికులపై వేధింపులు మానుకుని వారికి గుర్తింపు కార్డులు అంద జేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ అనుబంధ పంచాయతీ కార్మికుల మండల అధ్యక్షుడు కె.కన్నయ్య, టి.నరేష్, టి.రేవతి, భవాని, చిన్నా, సురేష్, వెంకటేష్, జానకి తదితరులు పాల్గొన్నారు.