Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ప్రభుత్వ పాఠశాలలో ఫిబ్రవరి 24,25 తేదీలలో మణుగూరు బాలోత్సవం నిర్వహి స్తున్నట్టు లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు రీజీయన్ అడ్వైజర్ పిల్లారిశెట్టి హారిబాబు తెలి పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణుగూరు సబ్ డివిజన్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే బాలోత్సవం నిర్వహి స్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల (శివలింగాపురం) ఆధ్వర్యంలో సత్యభాస్కర సేవ, కళాపరిషత్, మణుగూరు వారి సౌజన్యంతో బాలోత్సవం నిర్వహిస్తున్నమన్నారు. మున్సిపాల్టీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధా నోపాధ్యాయులు గొర్తిక్రీస్తురాజు ఆధ్వర్యంలో బాలోత్సవం నిర్వహి స్తున్నమన్నారు. జూనియర్, సీనీయర్ విద్యార్థులకు పాటల పోటీలు, జానపద నృత్యాలు, చిత్రలేఖనం, పర్యావరణ పరిరక్షణ, మహిళల స్వీయ రక్షణ పై వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నమన్నారు. ఈ పోటీలలో గెలు పొందిన వారికి ప్రోత్సాహంతో పాటు బహుమతులు అందజే స్తామన్నారు. అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్దులు పాల్గోని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సోయం. కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి భాస్కర్ పాల్గొన్నారు.