Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఉద్యోగాలను ఫణంగా పెట్టి పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రభుత్వం చిన్నచూపు చూడడమే కాకుండా అనేక అవమానాలకు గురి చేస్తూ వంచనకు పాల్పడుతుందని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రామాచారి అన్నారు. మంగళవారం జరిగిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి చివరి వారంలో పీఆర్సీని ప్రకటిస్తామని, చివరి వాగ్దానంగా వెల్లడించిన ప్రభుత్వం, దానిని భంగం చేస్తూ గడువును డిసెంబర్ 31, 2020 వరకు సాగ దీస్తూ ఉత్తర్వులు వెలువరించిందన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేసి నప్పుడు నెలరోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ అమలు మాత్రం చేయలేదన్నారు. పీఆర్సీ అమలుకు అనేక సార్లు గడువులు పెంచుతూ తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్నారన్నారు. వ్యూహాత్మకంగా పత్రికలకు లీకులు, ప్రకటనలు ఇస్తూ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నారన్నారు. వార్తాపత్రికల పాఠకులుగా ఉన్న సామాన్య ప్రజల దృష్టిలో ఇప్పటికే మూడు సార్లు జీతాలు పెంచినట్లుగా ప్రచారం జరుగుతోంది, కానీ పెంచలేదన్నారు.
గ్రహణమొర్రి పిల్లలకు ఉచిత శస్త్రచికిత్స నవతెలంగాణ-భద్రాచలం
బసవ తారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి తెలంగాణ సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో భద్రాచలంలోని జడ్పీ గర్ల్స్ హై స్కూల్లోని ఫిజియో థెరపీ భవిత సెంటర్లో గ్రహణం మొర్రి పిల్లలకు మంగళవారం ఉచిత శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. పెదాల చీలిక, అంగిలి చీలిక, మాటలు రాని వారికందరికీ ఈ శిబిరంలో ఉచితంగా స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. 50 మంది గ్రహణ మొర్రితో బాధపడుతున్నవారికి చికిత్సలు చేసి, ఆపరేషన్ కోసం 30 మందిని రికమండ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. వీరికి వచ్చే నెలలో హైదరాబాద్లో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముకుంద రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ మాధవి, మండల విద్యాశాఖ అధికారి సమ్మయ్య, బసవతారకం హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ జోషి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, మురళీక ష్ణ, ఫిజియో థెరపీ వైద్యులు డాక్టర్ కనకనాగు, ప్రత్యేక ఉపాధ్యాయులు పద్మ, గర్ల్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పద్మా, ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీరామ్, సిద్దయ్య ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.